కరోనా భయంతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-28T17:03:37+05:30 IST

ఏప్రిల్‌ 15 వరకూ 144 నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి.

కరోనా భయంతో యువకుడి ఆత్మహత్య

చెన్నై : పుదుకోట జిల్లా అరంతాంగి సమీపం మరమడంగి గ్రామంలో విదేశాల నుంచి వచ్చిన యువకుడిని ఇంటిలో సా మాజిక దూరం పాటింపజేయడంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలో కరోనా నిరోధక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఏప్రిల్‌ 15 వరకూ 144 నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి.  విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన వారికి కరోనా పరీక్షలు జరుపుతున్నారు.


ఈ నేపథ్యంలో మరమడంగి గ్రామంలో  జనవరిలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ యువకుడిని కుటుంబీకులు కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో అతడిని ప్రత్యేక గదిలో ఉంచారు. దీంతో జీవితం విరక్తి చెందిన ఆ యువకుడు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-03-28T17:03:37+05:30 IST