HYD : ‘నేను ఓ అమ్మాయిని ప్రేమించా.. కానీ ఆమె నా ప్రేమను అంగీకరించట్లేదు.. చనిపోతున్నా..!’
ABN , First Publish Date - 2021-08-20T13:40:24+05:30 IST
అందుకే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నా.. అందరూ జాగ్రత్త’ అని ఫోన్ పెట్టేశాడు...
హైదరాబాద్ సిటీ/పేట్బషీరాబాద్ : అమ్మాయి ప్రేమించడంలేదని ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్బషీరాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ గణేష్ నగర్కు చెందిన పి.మణికంఠ(25) తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 17న మణికంఠ తన స్నేహితుడికి ఫోన్ చేసి ‘నేను ఓ అమ్మాయిని ప్రేమించాను.. కానీ, ఆ అమ్మాయి నా ప్రేమను అంగీకరించడంలేదు, అందుకే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నా.. అందరూ జాగ్రత్త’ అని ఫోన్ పెట్టేశాడు.
స్నేహితుడు తిరిగి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో వెంటనే మణికంఠ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మణికంఠ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకుతుండగా గురువారం జీడిమెట్ల ఫాక్స్సాగర్ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతుందని పేట్బషీరాబాద్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. చెరువు వద్ద ఉన్న మృతుడి బైక్, వస్తువుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో చెరువులోంచి మృతదేహాన్ని బయటకుతీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.