హైదరాబాద్ : పోలీసులపై తిరగబడ్డ యువకుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-27T13:31:35+05:30 IST
లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ఇమాద్నగర్లో బైక్పై...
హైదరాబాద్/రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ సులేమాన్నగర్ ఇమాద్నగర్లో లాక్డౌన్ సమయంలో బయట తిరగవద్దన్నందుకు పోలీసులను దుర్బాషలాడటమే కాకుండా వారిపై దాడి చేసినంత పనిచేసిన అమీర్(21), సోహెల్(19)లను అరెస్ట్ చేశారు. లాక్డౌన్ ఉల్లంఘన చేసినందుకు వారిపై 51-బి సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ఇమాద్నగర్లో బైక్పై తిరుగుతున్న ఇద్దరు యువకులను బయటకు రావద్దని డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డగించారు. దాంతో వారు పోలీసులను నానా దుర్బాషలాడారు. రోడ్డుపై ఉన్న రాయిని తీసి కొట్టేంత పనిచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇద్దరు యువకులు అమీర్, సోహెల్లను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.