ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-02-09T16:01:38+05:30 IST

హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది.

ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. యువకుడి మృతి

హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని డీసీఎం వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండల్ అప్పారెడ్డి పల్లికి చెందిన డీసీఎం డ్రైవర్ పల్లేటి గణేష్(19) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు ఓఆర్ఆర్ టీమ్స్ సహాయంతో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-09T16:01:38+05:30 IST