యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2020-08-10T10:18:12+05:30 IST

బెజ్జూరు మండల కేంద్రంలో ఆదివారం యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలు

బెజ్జూరు, ఆగస్టు9: బెజ్జూరు మండల కేంద్రంలో ఆదివారం యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి నియామకాలు చేపట్టలేదన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగమని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధిపై ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. ప్రభుత్వాలు ఇకనైనా కళ్లు తెరిచి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాజోద్దీన్‌, శ్యాంసుందర్‌, గంగయ్య, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-08-10T10:18:12+05:30 IST