బావిలో స్నానానికి దిగి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-04-21T05:28:09+05:30 IST

స్నానం కోసం స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలోకి దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. రావికమతం మండలం కొత్తకోటలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.

బావిలో స్నానానికి దిగి యువకుడి మృతి
గట్టా రమణ (ఫైల్‌ ఫొటో)

కొత్తకోటలో ఘటన

తల్లిదండ్రులు, చెల్లెళ్లు కన్నీరుమున్నీరు


రావికమతం, ఏప్రిల్‌ 20: స్నానం కోసం స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలోకి దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. రావికమతం మండలం కొత్తకోటలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తకోట గ్రామానికి చెందిన గట్టా రమణ(20) బంధువు గట్టా తాతబాబు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. అతని దహన సంస్కారాల అనంతరం స్నానం చేయడానికి ముగ్గురు స్నేహితులతో కలసి వ్యవసాయ బావికి వెళ్లాడు. రమణకు ఈత సరిగా రాకపోయినప్పటికీ స్నేహితులు ఉన్నారనే ధైర్యంతో బావిలోకి దిగాడు. కానీ నీట మునిగిపోయాడు. స్నేహితులు వెంటనే స్పందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి బావిలో గాలించగా రమణ మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి నూకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే కొత్తకోట ఎస్‌ఐ నాగకార్తీక్‌ తెలిపారు. కాగా, కుటుంబానికి ఆధారమైన కుమారుడి మృతితో తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


కారు ఢీకొని మహిళ మృతి

చోడవరం: మండలంలోని గోవాడ వద్ద కారు ఢీకొని అల్లంకి విజయలక్ష్మి (35) మృతి చెందారు. పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన విజయలక్ష్మి చోడవరంలోని ఓ బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్నారు. మంగళవారం ద్విచక్ర వాహనంపై వెంకన్నపాలెంలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి చోడవరం వస్తుండగా, చోడవరం నుంచి విశాఖపట్నం వెళుతున్న కారు గోవాడ వద్ద ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విజయలక్ష్మికి భర్త, ఏడాది వయసు గల కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-21T05:28:09+05:30 IST