కాంగ్రెస్‌ పార్టీలో పలువురి చేరిక

ABN , First Publish Date - 2020-12-04T04:35:48+05:30 IST

ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధ్రువకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి సమక్షంలో పలువురు విద్యార్థి నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌ పార్టీలో పలువురి చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న తులసిరెడ్డి

వేంపల్లె, డిసెంబరు 3: ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధ్రువకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి సమక్షంలో పలువురు విద్యార్థి నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం వేంపల్లెలో ఏబీవీపీ, ఎన్‌ఎన్‌ఎ్‌సఎ్‌ఫ విద్యార్థి నాయకులకు తులసిరెడ్డి కాంగ్రెస్‌ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలకు లోబడి క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తులసిరెడ్డి వీరికి సూచించారు. పార్టీలో చేరిన వారిలో బాబు, శంకర్‌, ప్రసన్న, మణికంఠ, ప్రవీణ్‌కుమార్‌, శ్రావణ్‌, ప్రశాంత్‌, శివశంకర్‌, భద్రి, మహేష్‌, జోసఫ్‌, నవీన్‌, వినోద్‌, శ్యామ్‌సన్‌, సుశాంత్‌, చండీ, విష్ణు, శ్రీను, హరి, రఫి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-04T04:35:48+05:30 IST