పార్వతీపురంలో యువకుల ఆందోళన
ABN , First Publish Date - 2020-08-05T20:35:17+05:30 IST
పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట
విజయనగరం జిల్లా: పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గరుగుబిల్లి మండలం, ఉల్లిభద్రకు చెందిన యువకులు ఆందోళన చేశారు. తమ గ్రామంలో 14 మందికి కరోనా సోకినా ఆసుపత్రికి తరలించలేదని నిరసన వ్యక్తం చేశారు. కరోనా రోగులను తరలించమని గ్రామ సచివాలయ సిబ్బందిని అడిగితే, దిక్కున్న చోట చెప్పుకోమని అంటున్నారని, సచివాలయాన్ని మూసేయమని అధికారులకు యువకులు విజ్ఞప్తి చేశారు.