బోనమెత్తిన వైఎస్ షర్మిల
ABN , First Publish Date - 2021-08-01T22:10:37+05:30 IST
బోనాల ఉత్సవాలను నగరమంతా ఉత్సహం జరుపుకుంటున్నారు. నగరంలో బోనాల జాతర సందడిగా సాగుతోంది.
హైదరాబాద్: బోనాల ఉత్సవాలను నగరమంతా ఉత్సహం జరుపుకుంటున్నారు. నగరంలో బోనాల జాతర సందడిగా సాగుతోంది. బోనాలతో పాతబస్తిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అంతా శుభం చేకూర్చాలంటూ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి బోనాలు, సాక సమర్పించారు. కరోనా మూడో దశ ముప్పు నుంచి నగరాన్ని కాపాడాలని పలువురు కోరుకున్నారు. అయితే ఈ సారి వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా బోనం మెత్తారు. అమ్మవారికి బోనం సమర్పించి ముక్కుతీర్చుకున్నారు. మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితురాలు రజిని కుటుంబసభ్యులతో కలిసి బోనాల ఉత్సవాలల్లో షర్మిల పాల్గొన్నారు.
లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. పాతబస్తీలో ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. సింహవాహిని మహంకాళి మందిరానికి భక్తులు తరలివస్తున్నారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. బోనాల సందర్భంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు.