వైఎస్సార్ బాటలోనే పట్టాలు ఇస్తాం: షర్మిల

ABN , First Publish Date - 2021-10-05T00:09:19+05:30 IST

పోడు భూములపై మాట ఇచ్చి కేసీఆర్ మరిచారని వైఎస్ షర్మిల అన్నారు. 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు. పట్టాలు ఉన్న భూములకు సైతం రైతు బందు ఇవ్వడం లేదని చెప్పారు.

వైఎస్సార్ బాటలోనే పట్టాలు ఇస్తాం: షర్మిల

హైదరాబాద్: పోడు భూములపై మాట ఇచ్చి కేసీఆర్ మరిచారని వైఎస్ షర్మిల అన్నారు. 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు. పట్టాలు ఉన్న భూములకు సైతం రైతు బందు ఇవ్వడం లేదని చెప్పారు. ఆదివాసీలు కేసీఆర్ కాలి కింద చెప్పుల్లా పడి ఉండాలా? ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్‌టీపీ అధికారంలోకి రాగానే పోడు భూముల్లో అందరికీ పట్టాలు ఇస్తామన్నారు. ఎన్ని లక్షల ఎకరాలైనా అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు. వైఎస్సార్ బాటలోనే పట్టాలు ఇస్తానని మాట ఇస్తున్నానని పేర్కొన్నారు. పోడు భూముల్లో సాగుకోసం అక్కడే కూర్చోవడానికి రెడీ అన్నారు. మహిళలని చూడకుండా కేసులు పెట్టీ జైల్లో పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. జైళ్లలో పాచి పోయిన అన్నం పెట్టారని మండిపడ్డారు. గిరిజనుల దగ్గర కేసీఆర్ భూములు లాక్కుంటున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-05T00:09:19+05:30 IST