ఇంకా మీరెందుకు సారు.. రాజీనామా చేయండి: Sharmila
ABN , First Publish Date - 2021-12-01T19:33:56+05:30 IST
వైఎస్సార్ పాలనలో కరెంట్, బస్ ఛార్జీలు పెంచింది లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు.
హైదరాబాద్: వైఎస్సార్ పాలనలో కరెంట్, బస్ ఛార్జీలు పెంచింది లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కేసీఆర్కు పరిపాలన చేతకాక విద్యుత్ సంస్థలను, ఆర్టీసీని నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. అవి పూడ్చుకునేందుకు సామాన్యుడిపై పన్నుల భారం మోపుతున్నారని అన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజల నడ్డి విరచేందుకు రెడీ అయ్యిందని తెలిపారు. ‘‘అప్పులు, పన్నులు పెరిగిపోతుంటే ఇంకా మీరెందుకు సారు.. రాజీనామా చేయండి’’ అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.