5వ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో YS Sharmila పాదయాత్ర..

ABN , First Publish Date - 2021-10-24T13:16:26+05:30 IST

వైఎస్ షర్మిల ప్రజాప్రస్ధానం పాదయాత్ర ఆదివారం 5వ రోజుకు చేరుకుంది. శనివారం నాలుగో రోజు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గొల్లపల్లిలో మొదలై మహేశ్వరం మండలం నాగరం వరకు సాగింది.

5వ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో YS Sharmila పాదయాత్ర..

రంగారెడ్డి: వైఎస్ షర్మిల ప్రజాప్రస్ధానం పాదయాత్ర ఆదివారం 5వ రోజుకు చేరుకుంది. శనివారం నాలుగో రోజు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గొల్లపల్లిలో మొదలై మహేశ్వరం మండలం నాగరం వరకు సాగింది. మొత్తం 14 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. నేడు ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామం నుంచి ప్రారంభం కానుంది. కొత్తతండ, డబ్లీగూడ, మన్సాన్‎పల్లి, కొత్వాల్ చెరువు తండా మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు మహేశ్వరం సభలో షర్మిల ప్రసంగించనుంది.

Updated Date - 2021-10-24T13:16:26+05:30 IST