పులివెందులకు వైఎస్ షర్మిల

ABN , First Publish Date - 2021-03-14T02:01:48+05:30 IST

సోమవారం పులివెందులకు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో షర్మిల పాల్గొననున్నారు.

పులివెందులకు వైఎస్ షర్మిల

హైదరాబాద్: సోమవారం పులివెందులకు వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో షర్మిల పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి వివేకాకు నివాళులర్పిస్తారు. బెంగళూరు నుంచి నేరుగా కడపకు ఆమె వెళ్తారు. 2019 మార్చి 16న వివేకానందరెడ్డి దారుణ హత్య గురయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపన కోసం షర్మిల పార్టీని స్థాపించేందుకు కసరత్తు చేస్తున్నారు. జగన్,‌ ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమాన్ని కోరితే.. తెలంగాణ కోడలిగా తాను ఈ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుతున్నానని తెలిపారు. జగన్‌కు, తనకూ మధ్య పార్టీపరమైన విభేదాలు తప్ప.. వ్యక్తిగతమైన విభేదాలు లేవని ఆమె పేర్కొన్నారు. అయితే... తెలంగాణ అభివృద్ధి కోసం జగన్‌ను ఎదిరించడానికి కూడా తాను సిద్ధమని షర్మిల స్పష్టం చేశారు. సొంత పార్టీ అని వేరు కుంపటి పెట్టిన షర్మిల మొదటిసారిగా పులివెందులకు పోతున్నారు. వివేకానందరెడ్డి వర్థంతి కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారా అనే విషయంపై స్పష్టత లేదు. 

Read more