వైఎస్ షర్మిలకు షాక్.. కీలక నేత రాజీనామా

ABN , First Publish Date - 2021-07-30T21:10:32+05:30 IST

తెలంగాణలో రాజన్న సంక్షేమం రాజ్యం తేవాలని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంకల్పంతో ఉన్నారు.

వైఎస్ షర్మిలకు షాక్.. కీలక నేత రాజీనామా

హైదరాబాద్: తెలంగాణలో రాజన్న సంక్షేమం రాజ్యం తేవాలని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంకల్పంతో ఉన్నారు. అయితే ఆదిలోనే ఆ పార్టీకి హంసపాదు ఎదురైంది. వైఎస్సార్ టీపీకి చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీ నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి ప్రతాప్‌రెడ్డి పంపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ టీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. అన్ని జిల్లాలను చుట్టేయాలని ఆమె అనుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్సార్ టీపీకి చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. తాను రాజీనామా చేయడానికి రాఘవరెడ్డి కారణమని చెబుతున్నారు. దీన్నిబట్టి ఆ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

Updated Date - 2021-07-30T21:10:32+05:30 IST