షర్మిల సభలో ప్రత్యేక అతిథి

ABN , First Publish Date - 2021-04-10T01:41:40+05:30 IST

దివగంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ సంకల్పం తీసుకోనున్నారు.

షర్మిల సభలో ప్రత్యేక అతిథి

ఖమ్మం: దివగంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ సంకల్పం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఆమె తలపెట్టిన సంకల్ప సభకు వచ్చారు. భారీ అభిమాన సందోహం మధ్య షర్మిల ఆమె తల్లి విజయలక్ష్మి వచ్చారు. ఈ సభకు విజయలక్ష్మి ప్రత్యేక అతిథిగా వచ్చారు. షర్మిలకు ఆశీస్సులు ఇవ్వడానికే విజయమ్మ వస్తున్నారని చెబుతున్నారు. అంతకుముందు దారి పొడవునా షర్మిల ఘన స్వాగతం పలికారు. లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని షర్మిల భావించినా కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 6 వేల మందితో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే సభకు వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఏంటన్నదానిపై సంకల్ప సభ ద్వారా షర్మిల స్పష్టతను ఇవ్వనున్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలన్నదే తన సంకల్పమన్న సంగతి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో ఆమె వెల్లడించారు. ఖమ్మం సంకల్ప సభలో తన సంకల్పం ఏంటన్నది ప్రజలకు వివరించనున్నారు.

Updated Date - 2021-04-10T01:41:40+05:30 IST