వివేకా హత్య కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ

ABN , First Publish Date - 2021-08-13T14:30:13+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది.

వివేకా హత్య కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ

కడప: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన సీబీఐ దృష్టి సారించింది. నేడు సీఎం జగన్‌కు,  వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని విచారించనున్నట్లు సమాచారం. నేడు విచారణకు హాజరుకావాలని ముందస్తుగా సీబిఐ అధికారులు పిలిచినట్లు తెలుస్తోంది. గతంలో కూడా శివశంకర్ రెడ్డిని  సిట్, సీబీఐ బృందాలు  విచారించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-13T14:30:13+05:30 IST