వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN , First Publish Date - 2022-01-18T04:16:21+05:30 IST
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైకోర్టులో జరిగింది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇవ్వాలంటూ...
అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైకోర్టులో జరిగింది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ ఇవ్వాలంటూ శివశంకర్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇచ్చేందుకు వీలు లేదని సీబీఐ వాదించింది. దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కీలక నిందితుడు కావడంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని సీబీఐ తెలిపింది. కడప కోర్టు కూడా బెయిల్ తిరస్కరించిందని సీబీఐ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ శివశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.