వ్యవసాయ రంగానికి మేలు చేసిన వైఎస్‌

ABN , First Publish Date - 2020-07-09T09:27:36+05:30 IST

వ్యవసాయరంగం, రైతులకు దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ ఎంతో మేలు చేశారని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము ప్రశంసించారు.

వ్యవసాయ రంగానికి మేలు చేసిన వైఎస్‌

డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము


గుంటూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయరంగం, రైతులకు దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ ఎంతో మేలు చేశారని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము ప్రశంసించారు. గుంటూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్‌ సహకార భవన్‌లో బుధవారం డాక్టర్‌ వైఎస్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఇన్‌చార్జి సీఈవో కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆదర్శరైతులు, డ్వాక్రా మహిళలను సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు.


సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీఎంఎస్‌ ప్రధాన కార్యాలయం జాగర్లమూడి చంద్రమౌళి సహకారభవన్‌లో డాక్టర్‌ వైఎస్‌ జయంతి వేడుకలను నిర్వహించారు.  వైఎస్‌ విగ్రహానికి డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ క్రిస్టినా, సురేష్‌ దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జీఎం హరగోపాలం, బిజినెస్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-09T09:27:36+05:30 IST