YSRCP అరాచకం.. సర్పంచ్ ఇంటిపై దాడి..

ABN , First Publish Date - 2021-11-29T19:56:50+05:30 IST

గుంటూరు : జిల్లాలోని ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో...

YSRCP అరాచకం.. సర్పంచ్ ఇంటిపై దాడి..

గుంటూరు : జిల్లాలోని ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో అధికార వైసీపీ అరాచకానికి పాల్పడింది. టీడీపీ సర్పంచ్ మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో ఫర్నీచర్‌ ధ్వంసమైంది. ఇదేంటి.. ఎందుకు దాడి చేస్తున్నారు..? అని మల్లేశ్వరి ఇంట్లోని మహిళలు ప్రశ్నించగా.. వారిపై కొందరు వైసీపీ కార్యకర్తలు బూతులు మాట్లాడారు. అయితే.. మల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారా..? లేదా అనే విషయం తెలియరాలేదు.

Updated Date - 2021-11-29T19:56:50+05:30 IST