భూముల కోసం బాబు దిగజారిపోయారు : పార్థసారథి

ABN , First Publish Date - 2020-08-06T23:43:46+05:30 IST

అమరావతిలో భూముల కోసం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

భూముల కోసం బాబు దిగజారిపోయారు : పార్థసారథి

అమరావతి : అమరావతిలో భూముల కోసం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారిపోయారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించారు. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంకా ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. రాజధాని రాష్ట్రాల పరిధిలోని అంశమే అని కేంద్రం స్పష్టం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


రాజధానికి చంద్రబాబు రూ.52 వేల కోట్లు ఖర్చు చేయలేదని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని వ్యాఖ్యానించారు. అధికారం నుంచి దిగిపోయే వరకు దోచుకోవడంపైనే బాబు దృష్టిపెట్టారని మండిపడ్డారు. అమరావతి రైతులకు కచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేస్తుందని పార్థసారధి తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఒక్కప్లాట్‌ కూడా ఇవ్వలేదని.. ఆయన ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని పార్థసారధి చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-08-06T23:43:46+05:30 IST