వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం : రోజా

ABN , First Publish Date - 2020-12-03T20:05:05+05:30 IST

గురువారం నాడు అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై

వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం : రోజా

అమరావతి : మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు ఒక్క వైసీపీకి మాత్రమే ఉందని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. గురువారం నాడు అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆమె.. మహిళలకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా జగన్ చేపట్టిన పథకాలు, మహిళలకు సీఎం ఇచ్చిన ప్రాధాన్యతను కూడా అసెంబ్లీ వేదికగా రోజా వివరించారు.


నా పూర్వ జన్మ సుకృతం..

‘వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం. మహిళల పక్షపాతి సీఎం వైఎస్ జగన్. భావితరాల గురించి ఆలోచించే నేత సీఎం జగన్ మాత్రమే. టెలివిజన్‌లో ఎలా కనిపించాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజన్. ప్రజలకు ఉజ్వల భవిష్యత్ కల్పించాలన్నది సీఎం జగన్ విజన్.  మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేస్తున్నారు. మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగే సాధికారత కోసం సీఎం కృషి చేస్తున్నారు. చంద్రబాబుది 420 విజన్. వైఎస్ జగన్ విజన్.. ఓ విప్లవం. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ప్రజా నాయకుడు వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.


అటు విమర్శలు.. ఇటు ప్రశంసలు..

ప్రతి ఆడ బిడ్డను రక్షించే దిశ చట్టాన్ని సీఎం తెచ్చారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వైఎస్ జగన్.. ఓ క్రియేటర్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో సీఎం జగన్ మహిళలకే పెద్దపీట వేశారు. మహిళల అభ్యున్నతికి చంద్రబాబు చేసిందేమీ లేదు. టీడీపీ, చంద్రబాబును షేక్ చేసిన ముఖ్యమంత్రి జగన్. వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. తోబుట్టువు కంటే ఎక్కువగా మహిళల్ని సీఎం జగన్ అభిమానిస్తారు. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక జగన్ అమలు చేశారు. క్రియేటివ్ ఆలోచనలు ఉన్న సీఎం వైఎస్ జగన్. మహిళలకు ఆస్తులను క్రియేట్ చేసి చూపిస్తున్న వ్యక్తి జగన్. పేదవాళ్లకు ఇచ్చే ఇళ్లపై కూడా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు అని టీడీపీని విమర్శిస్తూ.. జగన్‌పై రోజా ప్రశంసల వర్షం కురిపించారు.

Updated Date - 2020-12-03T20:05:05+05:30 IST