డాక్టర్‌‌గా మారిన YSRCP MLA రోజా..!

ABN , First Publish Date - 2021-12-20T14:14:39+05:30 IST

నేను డాక్టరు కావాలనేది మా ఇంట్లో వాళ్ల కల. ఇంటర్‌లో బైపీసీ తీసుకుని...

డాక్టర్‌‌గా మారిన YSRCP MLA రోజా..!

చిత్తూరు జిల్లా/పుత్తూరు : ‘నేను డాక్టరు కావాలనేది మా ఇంట్లో వాళ్ల కల. ఇంటర్‌లో బైపీసీ తీసుకుని మెడిసిన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష రాశా. ఈ లోగా సినిమా హీరోయిన్‌గా చాన్స్‌ రావడంతో అటు వైపు వెళ్లా. మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించా. ఇవాళ మెడికల్‌ క్యాంప్‌లో మెడలో స్టెతస్కోప్‌ పెట్టుకుని రోగి బీపీని చూస్తూ డాక్టరై నా కోరిక తీర్చుకున్నా అని నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. పుత్తూరు మండలం కేబీఆర్‌ పురంలో ఆదివారం సుభాషిణి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 


ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. వేళకు మంచి ఆహారం తీసుకుంటూ, ప్రతి రోజు వాకింగ్‌ చేయాలని సూచించారు. ఆస్పత్రి వైద్యాధికారులు సుభాషిణి, శ్రీధర్‌రాజు బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ  వైద్య శిబిరంలో 350 మంది రోగులను పరీక్షించినట్లు ఆస్పత్రి సీఈవో శ్రీనివాస్‌ తెలిపారు. ఎంపీపీ మునివేలు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-20T14:14:39+05:30 IST