జగన్ అభినవ అంబేడ్కర్గా మారారు : ఉషశ్రీ
ABN , First Publish Date - 2020-12-03T19:37:35+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినవ అంబేడ్కర్గా మారారని
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినవ అంబేడ్కర్గా మారారని వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యానించారు. గురువారం నాడు అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆమె.. సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్దే. నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి జగన్ అభినవ అంబేడ్కర్గా మారారు. అంబేడ్కర్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ సీఎం సమన్యాయం చేస్తున్నారు’ అని అసెంబ్లీలో జగన్పై ఉషశ్రీ ప్రశంసల వర్షం కురిపించారు.