‘దొర ఇప్పుడు ఎందుకో పొర్లు దండాలు పెడుతున్నాడు’
ABN , First Publish Date - 2021-09-04T17:01:09+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. ఏడెళ్ళలో అంబెడ్కర్ విగ్రహానికి కేసీఆర్ ఎప్పుడు దండ కూడా వేయలేదని... దొర ఇప్పుడు ఎందుకో పొర్లు దండాలు పెడుతున్నారని అన్నారు. సీఎంవోలో ఇప్పుడు దళిత ఆఫీసర్స్ను నెత్తిన పెట్టుకుంటున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులను సగం కూడా ఖర్చు చేయని కేసీఆర్....దళిత ఓట్ల కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అయ్యారని తెలిపారు. ఈ ప్రేమ అంతా హుజూరాబాద్ ఎన్నికల మహిమ అని వ్యాఖ్యానించారు. దళితుల మీద నిజంగా తమకు ఈ ప్రేమ ఉంటే ఈ డ్రామాలు ఆపాలన్నారు. ఐదేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ హామీ ఇచ్చిన లెదర్ పార్క్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 20 వేల మంది దళితులకు ఉపాధి కల్పించాలని షర్మిల ట్వీట్ చేశారు.