ఇంకా ఎంతమంది చనిపోతే కేసీఆర్ స్పందిస్తారు?: Sharmila

ABN , First Publish Date - 2021-09-14T16:56:07+05:30 IST

నిరుద్యోగి బోడ సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోలేదని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు.

ఇంకా ఎంతమంది చనిపోతే కేసీఆర్ స్పందిస్తారు?: Sharmila

హనుమకొండ: నిరుద్యోగి బోడ సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోలేదని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా హనుమకొండ వచ్చిన షర్మిల కేయూ జంక్షన్ లో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది చనిపోతే కేసీఆర్ స్పందిస్తారని నిలదీశారు. పది వారాలుగా తాను నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందన లేదన్నారు. కేసీఆర్ మెడలు వంచే వరకు తన దీక్షలు కొనసాగుతాయని షర్మిల స్పష్టం చేశారు. 

Updated Date - 2021-09-14T16:56:07+05:30 IST