17వ రోజుకు YS Sharmila ప్రజాస్థానం పాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-05T14:11:21+05:30 IST

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల చేపట్టి ప్రజాప్రస్థానం పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది.

17వ రోజుకు YS Sharmila ప్రజాస్థానం పాదయాత్ర

నల్లగొండ: వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది.  నేడు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుంది. ఉదయం 9:30 గంటలకు చింతపల్లి మండలం కిష్టరాయన్‌పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. 10:30 గంటలకు మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం 4 గంటలకు మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో మాటముచ్చటలో వైఎస్ షర్మిల ప్రసంగించనున్నారు.

Updated Date - 2021-11-05T14:11:21+05:30 IST