KCR ప్రభుత్వం ఒప్పుకున్నందుకు సంతోషం.. : YS Sharmila

ABN , First Publish Date - 2021-07-22T18:50:47+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు.

KCR ప్రభుత్వం ఒప్పుకున్నందుకు సంతోషం.. : YS Sharmila

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘మీది ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని ఒప్పుకున్నందుకు సంతోషం. ఎన్నిక‌ల్లో గ‌ట్టేక్కేందుకు త‌ప్ప, మీకు ప్ర‌జ‌ల అభివృద్దిమీద ప‌ట్టింపులేదు.జ‌నాల‌ను మోసం చేస్తున్నాం అని చెప్పి ఒప్పుకున్నారు. ప్ర‌జ‌లు ఆలోచించాలి..ఎన్నిక‌లు ఉంటేనే ప‌థ‌కాలు వ‌స్తాయి. ఎన్నిక‌లు వ‌స్తేనే మీ ప్రాంతాల అభివృద్ది జ‌రుగుతుంది. మీ ప్రాంతం అభివృద్ది జ‌ర‌గాలంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను రాజీనామాలు చేయించండి. ఉప ఎన్నిక‌లు వ‌స్తేనే మీ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి ప‌డుతుంది. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కొత్త ప‌థ‌కాలు తెస్తారు..గెలిచాక మూల‌న ప‌డేస్తారు’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-07-22T18:50:47+05:30 IST