రామాపురంలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2022-01-18T06:27:19+05:30 IST

మండలంలోని రామాపురం గ్రామంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్‌ విగ్రహాన్ని గుర్తు తెలి యని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.

రామాపురంలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం
రామాపురంలో ధ్వంసమైన వైఎస్సార్‌ విగ్రహం

 విగ్రహం తల, చెయ్యి నరికిన గుర్తుతెలియని వ్యక్తులు 

చిలుకూరు, జనవరి 17: మండలంలోని రామాపురం గ్రామంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్‌ విగ్రహాన్ని గుర్తు తెలి యని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.  కోదాడకు వెళ్లే  రహ దారిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహం తల, చేతిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఉండటాన్ని  సోమవారం తెల్లవారు జామున వాకింగ్‌కు వెళ్లిన  గ్రామస్థులు గుర్తించి  పోలీసులకు సమాచారం ఇచ్చా రు. మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్సార్‌ విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దోషులను వెంటనే శిక్షిం చాలని తెలంగాణ వైఎస్సార్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు  ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిలుకూరు ఏఎస్‌ఐ జగన్మోహన్‌ తెలిపారు.




Updated Date - 2022-01-18T06:27:19+05:30 IST