వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి స్వీట్..:వేమూరి ఆనంద్ సూర్య

ABN , First Publish Date - 2020-05-27T23:27:19+05:30 IST

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శలు గుప్పించారు.

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి స్వీట్..:వేమూరి ఆనంద్ సూర్య

గుంటూరు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై  ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శలు గుప్పించారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి స్వీట్ షాపు పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఆచారాలు తెలియని సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ గా ఉండే అర్హత లేదని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని వేమూరి ఆనంద్ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయ ఆస్తుల వేలం నిర్ణయం అపచారమని, టీడీపీ హయాంలో స్వామి వారి ఆస్తులపై సర్వే మాత్రమే చేశామని, స్వామివారి ఆస్తులు కాజేయాలని చూస్తే హిందువులు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. మంత్రి వెల్లంపల్లికి అర్చకుడికి, పురోహితునికి తేడా తెలీదని, అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోక తప్పదని వేమూరి ఆనంద్ సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-05-27T23:27:19+05:30 IST