టీటీడీ అంశంపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2020-09-20T00:15:37+05:30 IST
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత సోము వీర్రాజు స్పందించారు. టీటీడీ అంశంపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ప్రకటించారు.
అమరావతి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత సోము వీర్రాజు స్పందించారు. టీటీడీ అంశంపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. అబ్దుల్ కలాం తిరుమలను సందర్శించినప్పుడు.. రిజిస్టర్లో సంతకం చేసి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు. ఇది యావత్ భారతదేశంలో అన్యమతస్థులకి వర్తించే అంశమన్నారు. టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలు అనాలోచిత వైఖరి అని సోము వీర్రాజు తప్పుబట్టారు.