ఉదయం పూటనే ఉపాధి పనులు చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-03-02T05:14:49+05:30 IST
రానున్న వేసవికాలాన్ని పరిగణలోకి తీసుకొని కూలీలు ఉ పాధి పనులు ఉదయం పూటే చేయాలని జడ్పీ సీఈవో విద్యాలత సూచించారు.
కూలీలకు జడ్పీ సీఈవో విద్యాలత సూచన
చంద్రుగొండ, మార్చి1: రానున్న వేసవికాలాన్ని పరిగణలోకి తీసుకొని కూలీలు ఉ పాధి పనులు ఉదయం పూటే చేయాలని జడ్పీ సీఈవో విద్యాలత సూచించారు. సోమవారం సీతాయిగూడెంలో ఉపాధి హామీ పథకం పనులను ఆమె స్వయంగా క్షేత్ర స్థాయి లో వెళ్ళి పరిశీలించారు. కూలీలతో నేరుగా మాట్లాడారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని సమయ పాలన పాటిస్తూ పనులు చేసుకోవాలని, తద్వారా గ్రామాల్లోనే ఉపాదిని పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఆమె వెంట ఎంపీడీవో అన్నపూర్ణ, మండల పంచాయతీ అధికారి తోట తులసీరాం, ఏపీవో ప్రమీల, సర్పంచ్ కేసరి కాంతమ్మ పాల్గొన్నారు.