అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం

ABN , First Publish Date - 2021-04-09T05:10:19+05:30 IST

జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పని చేద్దామని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం
అయిజ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

అయిజ, ఏప్రిల్‌ 8 : జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పని చేద్దామని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. పట్టణంలోని మండల కార్యాలయంలో గురువారం నిర్వహించిన  సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తున్నారని, ప్రజలు, రైతులు క్షేమం కోరి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అందరం కలిసికట్టుగా పని చేసి అభివృద్ధి దిశగా ముందుకెళ్తామని తెలిపారు. కరోనా రెండవ దశ ప్రారంభమైందని, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు ఈ విషయంపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఎంపీపీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అయిజ మండల అభివృద్ధికి కలిసికట్టుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సింగిల్‌ విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎపీడీఓ సాయిప్రకాష్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-09T05:10:19+05:30 IST