AP: రాష్ట్రంలో ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-11-16T12:49:55+05:30 IST

రాష్ట్రంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. మొత్తం రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వివిధ కారణాలతో నిలిచిపోయిన

AP: రాష్ట్రంలో ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

అమరావతి: రాష్ట్రంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. మొత్తం రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.  వివిధ కారణాలతో నిలిచిపోయిన ఎన్నికలు ఇప్పుడు ఆయా స్థానాల్లో జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 954 కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది బరిలో ఉన్నారు. 8,07,640 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈ నెల 18న లెక్కించి అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు.

Updated Date - 2021-11-16T12:49:55+05:30 IST