స్టాక్స్ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌లో రోజు రూ.3 కోట్లకుపైగా చీటింగ్

ఇటివల కాలంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ పేరుతో జరిగే మోసాలు ఎక్కువయ్యాయి

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో వాట్సాప్‌, టెలిగ్రామ్‌‌లో ట్రేడింగ్‌ పేరుతో రోజూ సరాసరిగా రూ.3 కోట్లకుపైగా దోచేస్తున్నారు

గత కొద్ది రోజులుగా ఇలాంటి కేసులు భారీగా వస్తున్నాయని చెబుతున్న పోలీసులు

ట్రేడింగ్‌లో తక్కువ సమయంలో మంచి లాభాలొస్తాయని అనేక మందిని ప్రలోభాలకు గురిచేస్తున్న కేటుగాళ్లు 

ఈ ట్రేడింగ్‌ మోసాలలో వాట్సాప్‌ మేసేజ్‌లు మొదటి స్థానంలో ఉండగా, తరువాత టెలిగ్రామ్‌ ఉంది

ఈ గ్రూప్‌ల్లో ఉండేవారిలో 90 శాతం మోసగాళ్లకు సంబంధించినవారేనని చెబుతున్న పోలీసులు

లాభం వచ్చిందంటూ గ్రూప్‌లో ఉన్నవారిని ఉత్సాహపరుస్తూ ఆశ పెంచేలా పోస్టులు చేస్తుంటారని తెలిపారు

ఈ విధంగా అనేక మంది ఉద్యోగులు, మహిళలు కూడా మోసపోయినట్లు తెలిపిన పోలీసులు

ఇలాంటి వాటి విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు