చార్జీలు లేకుండానే ఫ్లిప్‌కార్ట్ నుంచి బస్ టికెట్ల బుకింగ్ ఆఫర్

డిజిటల్‌ కామర్స్‌ సేవల సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ట్రావెల్ బస్‌ టెకెట్ల బుకింగ్‌ సేవలను కూడా ప్రారంభించింది

ప్రయాణ సేవలను విస్తరించేందుకు ఇప్పుడు భారతదేశం అంతటా బస్ బుకింగ్‌ను అందిస్తోంది

అందుకోసం సంస్థ పలు రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్‌ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది

ప్రస్తుతం బెంగళూరు, ఛండీగఢ్‌, ఢిల్లీ, జైపూర్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబై, చెన్నైలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి

ఎలాంటి చార్జీలు లేకుండా బస్‌ టికెట్‌లను బుకింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడి

ఈ సేవల ప్రారంభం సందర్భంగా ఈనెల 15 వరకు 20 శాతం వరకు రాయితీ ఛాన్స్

దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సుల్లో ప్రయాణాలకు అవకాశం

అందుకు సంబంధించిన టికెట్‌ బుకింగ్‌ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ వెల్లడి

ఇప్పటికే విమాన టికెట్‌, హోటల్‌ బుకింగ్‌ సేవలను ఆరంభించిన ఫ్లిప్‌కార్ట్‌ ట్రావెల్