మే 1 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్స్, టీవీల సేల్స్ బంద్!

చైనా బ్రాండ్ వన్‌ప్లస్ సంస్థకు భారత్‌లో భారీ షాక్ తగిలింది

వన్‌ప్లస్‌‌కు చెందిన ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, టీవీలు సహా ఇతర సేల్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన

ఈ మేరకు వెల్లడించిన సౌత్ ఇండియా సంఘటిత విక్రయదారుల సంఘం (ORA)

ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 23 రిటైల్ స్టోర్ల యాజమాన్యాలు బుధవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యాయి

అక్కడే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన

ఈ క్రమంలో సంస్థకు చెందిన మొత్తం 4,500 స్టోర్లలో మే 1 నుంచి వన్‌ప్లస్ ఉత్పత్తుల అమ్మకాలు అన్నీ నిలిచిపోనున్నాయి

ఈ ఉత్పత్తులపై మార్జిన్ తక్కువగా ఉందని, వారెంటీ పరిష్కారం కూడా వేగంగా జరగట్లేదని పేర్కొన్న స్టోర్ల యాజమాన్యం

ఈ ఉత్పత్తుల్ని విక్రయిస్తే పలు సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్న స్టోర్ల యాజమాన్యాలు

ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని రిటైల్ విక్రయ సంస్థలు వన్‌ప్లస్ ఇండియా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి

కానీ ఏడాది గడుస్తున్నా కూడా కంపెనీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని యాజమాన్యాల వెల్లడి