కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా పిల్లలకు 18సంవత్సరాలు వచ్చే వరకూ రిటైర్మెంట్ కార్పస్ నిర్మించవచ్చు.

18సంవత్సరాల లోపు బాలబాలికలు అందరూ ఎన్‌పీఎస్​వాత్సల్య పథకానికి అర్హులే.

వాత్సల్య ఖాతా తెరిచేందుకు కనీసం రూ .1,000 ప్రారంభ కంట్రిబ్యూషన్ చేయాలి.

ఆ తర్వాత వార్షిక కంట్రిబ్యూషన్ రూ .1,000గా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.

బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ వంటి రిజిస్టర్డ్ పాయింట్లలో ఖాతా తెరవవచ్చు.

పిల్లలకి 18ఏళ్లు నిండిన తర్వాత సాధారణ ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతాగా అది మారుతుంది.

18ఏళ్ల పాటు వార్షికంగా రూ.10వేలు కడితే 10శాతం రాబడితో రూ.5లక్షలకు పెరుగుతుంది.

తల్లిదండ్రులు 60సంవత్సరాల వయసు వరకూ కడితే కార్పస్ రూ.2.75కోట్లకు చేరుతుంది.

దీంతో మీ పిల్లలు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.