సామాన్యులకు షాక్.. వంట నూనె ఇప్పుడే కొనండి, లేదంటే..

త్వరలో మధ్య తరగతి కుటుంబీకులపై మరో భారం పడనుంది

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వంట నూనెల ధరలు పెరగనున్నాయి

ముడిచమురు, శుద్ధి చేసిన ఎడిబుల్‌ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 20 శాతం పెంచింది

రిఫైన్డ్ ఫామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 12.5% నుంచి 32.5% వరకు సుంకం పెంచారు

దీంతో పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ రేట్లు పెరగనున్నాయి

ఈ పంటల రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

దేశంలో నూనె డిమాండ్‌లో 70 శాతానికి పైగా దిగుమతుల ద్వారా లభిస్తుంది

ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ నుంచి పామాయిల్‌ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాం

భారత్ ఎడిబుల్ ఆయిల్ దిగుమతుల్లో 50 శాతానికి పైగా పామాయిల్‌ ఉంది

అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేస్తున్నారు

ధరలు మరికొన్ని రోజుల్లో పెరగనున్న నేపథ్యంలో ఇప్పుడే వంట నూనెలను కొనుగోలు చేయండి మరి