పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారుల కోసం దిద్దుబాటు చర్యలకు దిగింది

ఇప్పటికే యూపీఐ లావాదేవీలు యథావిధిగా కొనసాగేందుకు యాక్సిస్ బ్యాంకుతో చేతులు కలిపింది

తాజాగా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది

దీంతో పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్, కార్డు మెషిన్‌ల సేవలు యధాతథంగా కొనసాగనున్నాయి

ఈ మేరకు వివరాలను వెల్లడించిన పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 

తమ నోడల్ అకౌంట్‌ను ఎస్‌బీఐకి బదిలీ చేసిన తర్వాత ఎస్క్రో అకౌంట్ ద్వారా మార్చామని ప్రకటన

దీనివల్ల మునుపటిలాగానే తమ వ్యాపార లావాదేవీలు జరుగుతాయని పేర్కొన్న సంస్థ

దీంతో Paytm డిజిటల్ చెల్లింపులను మార్చి 15 గడువు తర్వాత కూడా కొనసాగించుకోవచ్చు