త్వరలోనే UPI ద్వారా ATMలలో క్యాష్ డిపాజిట్ ఫీచర్

నగదు డిపాజిట్లకు సంబంధించి ఈ ప్రతిపాదన ఉన్నట్లు తెలిపిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

మొబైల్‌ఫోన్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేసేందుకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది

ఈ నిర్ణయంతో త్వరలో యూపీఐల ద్వారా బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసుకోవచ్చు

ప్రస్తుతం ఏటీఎం మెషీన్‌లలో నగదును డిపాజిట్ చేయాలంటే డెబిట్ కార్డు అవసరం

కొత్త ప్రతిపాదనతో బ్యాంకుల్లో నగదు నిర్వహణ భారాన్ని తగ్గించేలా కస్టమర్లు యూపీఐ నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు

ఇప్పటికే కార్డు లేకుండా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది

దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామన్న శక్తికాంత దాస్ 

ప్రస్తుతం యూపీఐ నుంచి లావాదేవీలు, బిల్లుల చెల్లింపులు, ఇతర డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి

కొత్త మార్పుతో ఏటీఎం కార్డు లేకుండా క్యాష్ డిపాజిట్ మరింత సులభతరం కానుంది