నీళ్లు ఎక్కువగా తాగితే మంచిది అంటారు. కానీ, మరీ అతిగా నీళ్లు తాగితే హైపోనాట్రేమియాకు దారి తీస్తుంది.
శరీరానికి అవసరమైన పోషకాలు బయటకు పోతాయి. వాంతులు, వికారం మొదలవుతాయి.
ఆరోగ్యానికి పళ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ, చాలా ఫలాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి.
కొన్ని సిట్రస్ ఫలాలు కడుపులో మంటను కలుగచేస్తాయి. ఫలాలను మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.
గ్రీన్ టీ పుష్కలంగా యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం, నిద్రకు ఆటంకం కలగడం, ఆందోళన మొదలైనవి గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్
తరచుగా విటమిన్, ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతుంటారు. వాటి వల్ల పోషక అసమతుల్యతకు దారి తీస్తాయి.
పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిదని చాలా మంది అంటుంటారు. పాల ఉత్పత్తులు శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్-డిలను శరీరానికి అందించి ఎముకల పుష్టికి సహాయపడతాయి.