రాగి పాత్రలో నీరు తాగితే  కలిగే ప్రయోజనాలు

రాగి పాత్రలో నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పురాతన కాలం నుంచి చెబుతున్నారు

ప్రతి రోజు రాగి పాత్రలో నీరు తాగడం  వల్ల పలు వ్యాధులను తరిమికొట్టవచ్చని ఆయుర్వేదం చెబుతోంది

అధ్యయనాల ప్రకారం కనీసం  8 గంటల పాటు రాగి పాత్రలో ఉంచిన  నీరు సూక్ష్మజీవుల కిల్లర్‌గా మారుతుంది

రాగి పాత్రలో నీరు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది

అలాగే స్ట్రోక్ ప్రమాదం, కడుపు చికాకును తగ్గించి ఇది జీవక్రియను పెంచుతుంది

రాగి పాత్రలో నీరు తాగడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది

రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని ఉదయం తాగితే ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు