రాత్రి పూట కీర దోస తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

కీరదోసలో 95 శాతం నీరే కావడంతో ఇది తిన్నాక రాత్రంతా డీహైడ్రేషన్ దరి చేరదు

రాత్రి ఆకలేసినప్పుడు కీర దోస తింటే బరువు పెరుగుతామన్న ఆందోళన లేకుండా కడుపు నింపుకోవచ్చు

కీరదోసలోని పీచు పదార్థం కారణంగా కడుపు ఉబ్బరం, మంట దరిచేరవు. దీంతో ప్రశాంతంగా కునుకు తీయొచ్చు.

కీరదోసలో నీరు, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్నవారికి బరువు నియంత్రణలో ఉంటుంది.

దోసలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ, బీ టా కెరొటీన్ కారణంగా ఆక్సిడేటివ్ స్ట్రేస్ తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది. 

ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మం ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వీటిల్లోని మెగ్నీషియం కండరాలు రిలాక్సయ్యేలా చేసి రాత్రిళ్లు సాఫీగానిద్ర ట్టేలా చేస్తాయి.