ఏ జ్యూస్‌లు తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

పైనాపిల్ జ్యూస్‌లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఆస్తమా లక్షణాలు అదుపులో ఉంచుతాయి. 

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. 

దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల  రక్త హీనత సమస్య దూరమవుతుంది. 

క్యారెట్‌లోని లుటిన్, జియాక్సంతిన్ వంటి కెనోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల  రోగ నిరోధక వ్యవస్థ బలబడుతుంది. 

బీట్‌రూట్, ఆకు కూరల జ్యూస్ తాగడం వల్ల డిప్రెషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. 

నిమ్మరసం, వెల్లుల్లి, ఆపిల్, ఆకుకూరలతో చేసిన జ్యూస్ తాగితే ఆస్తమా తగ్గుతుంది. 

బేరి, అరటి, స్ట్రాబెర్రీస్ మిశ్రమాన్ని తాగితే స్ట్రెస్ తగ్గుతుంది. 

నిమ్మ, పైనాపిల్, సెరల్స్, క్యారెట్ మిశ్రమంతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.