ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధిగా డయాబెటిస్ మారింది.

ప్రపంచవ్యాప్తంగా దీని వల్ల ఇబ్బంది పడేవారు చాలా మందే ఉన్నారు.

దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు, కళ్లు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతింటాయి.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు కొన్ని ఆహార పదార్థాలు తరచూ తీసుకోవాలి.

కివి, అవకాడో, జామపండు, బొప్పాయి వంటి పండ్లను తరచుగా తినాలి.

చక్కెరస్థాయి అధికంగా ఉంటే గ్రీన్ వెజిటేబుల్స్, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

ముఖ్యంగా కాకరకాయ, మెంతులను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

బాదంపప్పు, వాల్ నట్స్ క్రమం తప్పకుండా తినాలి.

మంచి ఆహారంతోపాటు రోజూ 45నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

ఆహారం, వ్యాయామం రెండిటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి షుగర్ నియంత్రించవచ్చు.