ఈ పదార్థాలు తిన్న తరువాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు..

కొన్ని ఆహారాలు తిన్న తరువాత నీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.

అరటిపండు తిన్న తరువాత నీళ్లు తాగితే దగ్గు, కఫం,  కడుపు సంబంధ సమస్యలు వస్తాయి.

శనగలు తిన్న తరువాత నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం సమస్య, అజీర్ణం సమస్య వస్తుంది.

ఐస్ క్రీమ్ తిన్న తరువాత నీళ్లు తాగితే గొంతు నొప్పి,  కఫం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

దోసకాయ తిన్న తరువాత నీళ్లు తాగితే జలుబు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

టీ తాగిన తరువాత నీళ్లు తాగితే పొట్ట లోపలి పొర దెబ్బ తింటుంది. దంతాలు కూడా దెబ్బ తింటాయి.

పెరుగు తిన్న తరువాత నీరు తాగితే పెరుగులో ప్రోబయోటిక్స్ విచ్చిన్నం అవుతాయి. పెరుగు జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

వేరుశనగలు తినగానే నీరు తాగితే గొంతు నొప్పి, వేరుశనగలు జీర్ణం కావడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

సిట్రస్ పండ్లు తీసుకున్న తరువాత నీరు తాగితే పొట్ట ఉబ్బరం, గొంతు నొప్పి సమస్యలు వస్తాయి.