మొటిమలు, మచ్చలు చర్మం యొక్క  సహజ మెరుపును తగ్గిస్తాయి.

ప్రతి ఒక్కరు అందమైన, మచ్చల్లేని, మృదువైన చర్మం కావాలని తాపత్రయపడుతుంటారు.

ఈ జీవనశైలి,ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా మొటిమలు,మచ్చలు,చర్మం పొడిబారడం వంటి సమస్యలు సాధారణంగా మారాయి.

ఈ రోజుల్లో చాలా మంది మొటిమలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి గంధపు ఫేస్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్.

ఒక టీ స్పూన్ చందనం పొడి తీసుకోండి.దానికి రోజ్ వాటర్ జోడించి మందపాటి పేస్ట్‌లా చేయండి.

ఈ పేస్టుని మొటిమలపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచండి

 ఆ తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడిగేయండి. 

ఈ ప్యాక్ చర్మం నుంచి బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మొటిమలు రాకుండా చేస్తుంది