ఉదయాన్నే లీటరు నిరు తాగితే కొన్ని ప్రయోజనాలతో పాటు దుష్ఫరిణామాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

ఉదయాన్నే లీటరు నీరు తాగితే జీవక్రియలు వేగవంతం అవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.

ఈ స్థాయిలో నీరు తాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.

తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడంతో రోజువారీ పనులకు ఆటంకాలు ఏర్పడతాయి.

కొందరికి అతిగా నీరు తాగితే కడుపులో ఇబ్బంది, వికారం వంటివి కలుగుతాయి.

కాబట్టి, నీరు ఎంత తాగాలన్న విషయంలో వైద్యుల సలహా మేరకే నడుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు

ఆరోగ్యం బాగుండాలంటే సరైన మోతాదులో నీటితో పాటూ పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.