రాత్రి భోజనంలో ఈ ఫుడ్స్ దూరం పెడితే చాలు.. !

పగటి భోజనం గట్టిగా తిన్నా, రాత్రి సమయంలో తీసుకునే భోజనం ఎంత తేలిగ్గా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే..

మసాలా ఆహారాలు రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల అజీర్ణం, నిద్ర సరిగా పట్టకపోవం వంటి సమస్యలు ఎదురవుతాయి. 

అధిక కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్ట భారంగా మారుతుంది. 

ఎక్కువగా వేయించిన పదార్థాలు నిద్రలేమికి కారణం కావచ్చు. అలాగే అజీర్ణం కలిగే అవకాశం ఉంది.

నూడిల్స్, పిజ్జా, పాస్తా, బ్రెడ్ వంటి పిండి పదార్థాలు రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. 

రాత్రి భోజనంలో పచ్చి సలాడ్ తినడం చాలా తేలికైన ఫీలింగ్ ఇస్తుంది.

డెజర్ట్‌లు రాత్రి సమయంలో తీసుకోవడం ఇబ్బంది పెంచుతుంది. 

రాత్రి భోజనం సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం జీర్ణక్రియకు ఇబ్బందితో పాటు, నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.