జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు పసుపు పాలు తాగకూడదు..!

పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు.

పసుపు పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్తీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

 ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని భావించే  పసుపు పాలను తాగడం కొన్ని సమస్యలున్న వారికి ప్రమాదం.

లో బీపీ లేదా రక్తపోటు తక్కువగా ఉన్నవారు పసుపు పాలు తాగకూడదు. ఇది బీపీని ఇంకా తగ్గిస్తుంది.

చాలామందికి పాలు తాగడం వల్ల అలెర్జీ సమస్య ఉంటుంది. ఇలాంటి వారు పసుపు పాలను తాగకూడదు.

గ్యాస్,  ఉబ్బరం సమస్యతో బాధపడేవారు పసుపు పాలను అసలు తాగకూడదు.  జీర్ణసంబంధ సమస్యలు పెరుగుతాయి.

పసుపులో కర్కుమిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతుంది.